ఎంతో ఘనమైన చారిత్రకమైన విజయనగరం చాలా ఏళ్ల తర్వాత పంచాయతీ నుంచీ పురపాలక సంఘం ఆ పై నగర పాలక సంస్థ గా రూపాంతరం చెందింది. తాజాగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో ..వీఎంసీ ఆవిర్భవించిన తర్వాత రెండో బడ్జెట్ సమావేశాల సందర్భంగా… డిప్యూటీ మేయర్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల హవా కొట్టొచ్చినట్లు కనిపించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా దాదాపు 141 కోట్లతో కార్పొరేషన్ బడ్జెట్ పెట్టాల్సిన సమయంలో… దాన్ని మోడరనైజేషన్ రూపంలో డిప్యూటీ స్పీకర్ బిడ్డ…
డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి… ఆంగ్లంలో అనర్గళంగా కార్పొరేషన్ సభ్యులు ముందు ప్రవేశ పెట్టడం విశేషం. అదీ మేయర్ విజయలక్ష్మి అధికారికంగా కూర్చొని ఉండగానే… అసిస్టెంట్ కమీషనర్ ప్రసాద రావు…మాట్లాడుతూ… డిప్యూటీ మేయర్ శ్రావణి గారు.. బడ్జెట్ ను పీపీపీ రూపంలో ప్రవేశ పెడతారని చెప్పడంతో… జంకు లేకుండా ఇంగ్లీష్ లో ఆ పని చేశారు… డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి.అనంతరం… మేయర్ ఆదేశాలతో… బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు… కమీషనర్ శ్రీరాముల నాయుడు. ఈ సమావేశంలో మరో డిప్యూటీ మేయర్ రేవతి, ఫ్లోర్ లీడర్ రాజేష్… అతి తక్కువ సంఖ్యలో కార్పొరేటర్ లు హాజరయ్యారు.