దేశంలోనే ఖరీదైన ఎన్నిక మునుగోడు ఎన్నిక అని కాంగ్రెస్స్ ఎంఎల్సి జీవన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో బాగంగా నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ పక్షాన పోలీస్,రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నట్లు కనిపించట్లేదన్నారు. ఏ గ్రామంలో చూడు 10 కన్నా ఎక్కువ బెల్టు షాపులు వున్నాయని, చిట్టి ఇస్తే బెల్ట్ షాప్ లో మద్యం ఇస్తారని, మునుగోడులో మద్యం ఏరులై పారుతుందన్నారు. దేశంలోనే ఖరీదైన ఎన్నిక మునుగోడు ఎన్నిక నిలిచే అవకాశం వున్నదని, బీజేపీ,తెరాస పార్టీలకు చెందిన వారు తమకు ఉన్న ఆర్థిక బలముతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని, అన్నదమ్ములు భిన్న పార్టీలలో ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు కానీ ఇలా అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పడం సరికాదన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉండి వేరే రాజకీయ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పటాన్ని, కాంగ్రెస్స్ పార్టీ తీవ్రంగా నిరసిస్తు ఖండిస్తుందన్నారు.
next post