కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని పైలట్ భోపాల్లో ల్యాండ్ చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో జరిగింది.
కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరులో విపక్షాల భేటీ జరిగింది. ఈ భేటీ ముగిసిన అనంతరం సోనియా, రాహుల్ బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి విమానంలో ఢిల్లీ బయల్దేరారు. టేకాఫ్ అయిన కొంత సమాయానికి ప్రతికూల వాతావరణం నెలకొనడంతో విమానాన్ని భోపాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.