పూలే ఆశయ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఅర్ పాలన కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పూలే ఆశయ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఅర్ పాలన కొనసాగుతుంది అని రాష్ట్ర మంత్రిలు కేటీర్,పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ నందు మంత్రలు కేటీర్, పువ్వాడ అజయ్ కుమార్ జ్యోతిబా పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.సమాజ హితం కోసం ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జ్యోతిబా ఫూలే అందించిన స్ఫూర్తితో కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు.