32.2 C
Hyderabad
May 2, 2024 00: 19 AM
Slider విశాఖపట్నం

విశాఖ విజయదుర్గా దేవి ఆలయంలో దోపిడి దొంగలు

విశాఖలో అర్ధరాత్రి దొంగలు స్వైరవిహారం చేశారు. పోలీసులందరూ రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో ఉండగా అదునుచూసి చెలరేగిపోయారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి టైలర్స్ కొలనీలో విజయదుర్గా దేవి ఆలయంను కొల్లగొట్టారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో దుండగులు ఆలయం తాళాలను కట్ చేసి అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు పుస్తుల తాడు,సూత్రాలతో పాటుగా హుండీని దొంగిలించారు.

దొంగలు బైకు మీద హుండీతో పరారవ్వడాన్ని ఓ స్థానికుడు గమనించి ఆలయ ధర్మకర్తలకు సమాచారం అందించగా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిఎంపాలెం పోలీసులుఘటనా స్థలానికి చేరుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవాలయాలలోని చోరీలు నిత్యకృత్యంగా
మారడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

అన్యాక్రాంతమైతున్న ప్రభుత్వ భూములు

Satyam NEWS

కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు

Satyam NEWS

నాకు మంత్రి పదవి రాదు: కొడాలి నాని

Satyam NEWS

Leave a Comment