కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. ఇంట్లో దంపతులు, కుమారుడుతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. బైరి శంకరయ్య (55), జమున (55), శ్రీధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు. ఇంటి బయట తాళం వేసి, మరో ద్వారం ద్వారా లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు నెలల కిందట కూతురు వివాహము చేశారని, అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post