హైదరాబాద్ లోని హబీబ్ నగర్ పి ఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్న పిల్లలు ప్రమాదవశాత్తూ మరణించారు. మంగర్ బస్తీ లోని అఫ్జల్ సాగర్ వీధిలో వున్నట్టుండి ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో నిద్రలో ఉన్న3 చిన్నారులు మృతి చెందారు.
ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిని రోషిని (6) , పావని (4), సారిక (4)లుకా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న హాబీబ్ నగర్ పోలీసులు, క్లూస్ టీమ్ తదుపరి వివరాల కోసం చూస్తున్నది. జీ హెచ్ ఎం సీ డిసాస్టర్ టీమ్ చేరుకుని అక్కడ శిథిలాలను తొలగిస్తున్నారు. మృతదేహాలు ఉస్మానియా మార్చురీకి తరలించారు. హబీబ్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.