38.2 C
Hyderabad
May 2, 2024 21: 25 PM
Slider ముఖ్యంశాలు

పేదరికంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం

#chadalawada

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో సంతగుడిపాడు గ్రామంలో మంగళవారం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పర్యటించారు. ఆ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కార్యకర్త బి.రామకోటి పార్ధివదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్దిక సహాయం అందజేశారు. అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్తలు ఎ.ప్రభుదాస్, జి.బుజ్జి లను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు .పేదరికంలో ఉన్న వారికి ఆర్దిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపిలో పని చేస్తున్న నాయకులను,కార్యకర్తలను ఆపద సమయంలో ఆదుకొంటానని అన్నారు.

నాయకులు,కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. గ్రామంలో టీడీపీ విస్తరణకు అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్త రామకోటి అనారోగ్యం మృతి చెందటం పార్టీకి తీరని లోటని అన్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,మండల నాయకులు ఆదిబాబు,ఇమిడిశెట్టి కాశయ్య, అప్పారావు,కొండలు,శ్రీను, దాసు,వెంకయ్య,రమణారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Related posts

పెండింగ్ పనులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

Satyam NEWS

ప్రాక్టికల్: చనిపోయాడు అని స్టేటస్ పెట్టి మరి చచ్చాడు

Satyam NEWS

జ్యుడిషియల్ అధికారుల నివాస స్థల పరిశీలన

Bhavani

Leave a Comment