చిత్తూరు జిల్లా తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి దంపతులు, జెఈఓ పి.బసంత్ కుమార్ దంపతులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.