42.2 C
Hyderabad
May 3, 2024 16: 29 PM
Slider ఆధ్యాత్మికం

ఆపద మొక్కులు: పెరిగిన తిరుమల వెంకన్న ఆదాయం

thDN73YIVR

తిరుమల తిరుపతి దేవస్థానానికి కాసులు గలగలలాడుతున్నాయి. వేంకటేశ్వరుడికి హుండీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే  గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఏడు నెలల్లో  రూ.777.78 కోట్ల కానుకలు తిరుమల వేంకటేశుడికి అందాయి.

2018లో ఏడు నెలల కాలంలో రూ. 707.95 కోట్లు మాత్రమే వచ్చింది. ఈసారి  రూ.69.82 కోట్లు ఎక్కువగా హుండీ ఆదాయం పెరిగింది. ఈ ఏడాది 7 నెలల కాలంలో 803 కిలోల  బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 241 కిలోల బంగారం అధికంగా వచ్చింది.

ఇక వెండి కూడా ఈసారి  3,852 కిలోలు లభించగా, గత ఏడాది 1,859 కిలోలతో పోల్చితే1993 కిలోలు అధికంగా వచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే 21.16 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.

Related posts

విజయ అంతిమ యాత్రకు హైదరాబాద్ తరలిరండి

Satyam NEWS

రేషన్ బియ్యం పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు

Satyam NEWS

సెంట్రల్ వెస్టా ప్రాజెక్టు అంటే ఏమిటి? వివరాలు ఇవిగో

Satyam NEWS

Leave a Comment