కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో టీజేఎస్ కుత్బుల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది టీజేఎస్ నాయకులు కార్యకర్తలు ఈరోజు బిజెపిలో చేరారు.
కుత్బుల్లాపూర్ అభివృద్ధి కూన శ్రీశైలం గౌడ్ తోనే సాధ్యమని భావించి, చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు బిజెపిలో చేరారు.
టీజేఎస్ నుంచి బిజెపిలో చేరిన వారిలో కుత్బుల్లాపూర్ టీజేఎస్ వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్,మణి, టీజెఎస్ నాయకులు ఆనంద్, రవి, కృష్ణ, గోపాల్, నరేందర్, ఆకాష్, కుమార్, ఆనంద్, అరుణ్, రమణ, శ్రీధర్, తేజ తదితరులు ఉన్నారు.