నాయకపోడు సేవా సంఘం ములుగు జిల్లా నాయకురాలు తైనవేని సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల బిక్షపతి కోరారు.
సరోజన సామాజిక ఉద్యమాలలో, ములుగు జిల్లా సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని నాయకపోడు జాతి కోసం కూడా నిరంతరం కష్టపడి పనిచేశారని ఆయన అన్నారు.
మహిళల సమస్యల పైన కూడా సరోజన పనిచేస్తున్నారని బిక్షపతి అన్నారు. సంఘసంస్కర్త అయిన సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సరోజనను పరామర్శించిన వారిలో పల్లెల్లో సతీష్ కుమార్ సమ్మయ్య రాజు నవీన్ రమేషు కిరణ్ తదితరులు ఉన్నారు.