సీఎం కె.సి.ఆర్. 66 వ పుట్టినరోజును హరితహారం దినోత్సవంగా భావిస్తూ నగరంలోని 150 వార్డులలో మొక్కలు నాటనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు అనుగుణంగా 36 నర్సరీలనుండి 2 లక్షల 50 వేల మొక్కలను తరలించి అన్ని వార్డులలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే ప్రతి వార్డులో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సహచరులు, అధికారులు,కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్ జి ఓ ల భాగస్వామ్యంతో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రతి వార్డులో ఒక చోట సామూహిక ప్లాంటేషన్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వార్డులతో పాటు పబ్లిక్ ప్లేసెస్ చార్మినార్, బిర్లా టెంపుల్, ఎం జి బి ఎస్, జె బి ఎస్ బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్స్, సెక్రటేరియట్, జి హెచ్ ఎం సి హెడ్ ఆఫీస్, ముఖ్యమైన మెట్రో స్టేషన్ల వద్ద మొక్కలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.