విజయనగరం రింగ్ రోడ్ ఫోర్ట్ సిటీ స్కూల్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రహదారి భద్రత నియమాల పట్ల ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఆదేశాలు..ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు సూచనల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర రావు ఆటో డ్రైవర్లకు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు.
స్కూల్ పిల్లలను ఆటోల్లో తీసుకొని వెళ్ళే వారు మరింత జాగ్రత్త గా వ్యవహరించాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించ వద్దన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత ప్రమాణాలు పట్ల తప్పనిసరిగా అవహాన కలిగి ఉండాలన్నారు. వాహనాలను అతి వేగంగా నడప వద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలను పార్కింగ్ చేయవద్దని కోరారు. నిబంధనలు కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర రావు హెచ్చరించారు.