బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుండి కిందపడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని ఒకరు మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. మూడంతస్తుల భవనంపైన ఉండి ఇమ్రాన్ అనే యువతి బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ చూసుకోలేదు. అలాగే నడుస్తూ రావడంతో మూడంతస్తుల భవనం పై నుండి కిందపడి మృతి చెందింది.
మృతురాలు ఎయిర్ పోర్ట్ లో కస్టమర్ సర్వీసెస్ లో ఉద్యోగిని. కర్నాటక ముదుళికి పట్నం చెందిన యువతిగా ఆమెను గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.