విశాఖ రేంజ్ కు కొత్తగా వచ్చిన రేంజ్ డీఐజీ హరికృష్ణ.. ఆకస్మిక తనిఖీ లు ప్రారంభించారు. ఈ మేరకు వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లాలో అరకు దగ్గరలో ఉన్న వల్లంపూడి పోలీసు స్టేషను ను సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని పరిశీలించి, రికార్డులను, సీడీ ఫైల్స్ ను చెక్ చేసి చేశారు.
నేరాల నియంత్రణలో భాగంగా రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను రేంజ్ డీఐజీ ఆదేశించి, పాలన పరమైన పలు సూచనలు చేశారు. విజయనగరం ఎస్పీ ఎం.దీపిక విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ టి.త్రినాథ్, ఎస్.కోట సీఐ సింహాద్రి నాయుడు, వల్లంపూడి ఎస్ఐ రాజేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.