40.2 C
Hyderabad
April 29, 2024 18: 30 PM
Slider నిజామాబాద్

Tragedy: గంట వ్యవధిలోనే భార్య భర్త మృతి

#death

కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ఈ వైరస్ బలితీసుకున్న ఘటనను మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.

కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనాతో మరణించిన విషాద ఘటన ఇది. ఆర్మూర్ ఎంఐఎం నేత గోరేమియా ఇటీవల కరోనా బారినపడ్డారు.

దీంతో కుటుంబసభ్యులు కూడా టెస్ట్ చేయించుకోగా ఆయన భార్యకు కూడా పాజిటివ్ గా తేలింది. దంపతులిద్దరూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) ఉదయం గోరేమియా ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు.

కుటుంబసభ్యులు వెంటనే ఆయన మృతదేహాన్ని ఆర్మూరుకు తరలించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోయారు. ఇలా కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలను కరోనా బలితీసుకుంది.

Related posts

OTC New Penis Pills

Bhavani

మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కేర్ ఆఫ్ కంచెరపాలెం నిర్మాత ప్రవీణ

Satyam NEWS

గుడ్ న్యూస్ : ఉల్లి ధరలు త్వరలో తగ్గబోతున్నాయి

Satyam NEWS

Leave a Comment