ఇండియా- బంగ్లాదేశ్ దేశాల మధ్య రైళ్ల సర్వీసులపై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మైత్రీ ఎక్స్ ప్రెస్, బంధన్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులు మార్చి 26 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ కు లోబడి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు దేశాల మధ్య రైలు సేవలు మార్చి 2020లో నిలిపివేయబడ్డాయని రైల్వే శాఖ పేర్కొంది. తిరిగి ప్రభుత్వం రైలు ను పునరుధరించనున్నది.