జిల్లా పరిషత్తు కార్యాలయంలో సరైన వేతనం లేక అవస్థలు పడుతున్న స్వీపర్లు, అటెండర్లను ఆదుకోవాలని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ కోరారు. ఈ మేరకు ఆయన ఈరోజు ములుగు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కలిసి పలు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు.
నూతన జిల్లా ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిందని, కరోన వలన జరగవలసిన రీతిలో అభివృద్ధి కాలేదని ఆయన తెలిపారు. కరోన తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో జిల్లా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కోరారు.