తెలంగాణలో పనిచేస్తున్న ఎనిమిది మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న కరుణాకర్ ను భూపాలపల్లి ఎస్పీగా, ఎస్పీగా పని చేస్తున్న సురేందర్ రెడ్డిని హైదరాబాద్ కామెంట్ కంట్రోల్ కు, వెయిటింగ్ లో ఉన్న పుష్ప ను కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ కు, మేడ్చల్ డిసిపి గా పనిచేస్తున్న సందీప్ ను మాదాపూర్ డీసీపీగా పంపారు.
మాదాపూర్ డీసీపీగా పనిచేస్తున్న శిల్పవల్లిని హైదరాబాద్ అడ్మిన్ డీసీపీగా, సైబరాబాద్ వివో డబ్ల్యూ డిసిపి గా పనిచేస్తున్న కవితను ఉమెన్స్ సేఫ్టీ డిసీపీగా, రాచకొండ ట్రాఫిక్ టు డిసిపి గా పనిచేస్తున్న శ్రీనివాసులు ట్రాఫిక్ 3 డిసిపి గా, వెయిటింగ్ లో ఉన్న ప్రసన్న రాణిని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు పర్సనల్ విభాగం అదనపు డీజీగా సౌమ్య మిశ్రా, ఔషధ నియంత్రణ డైరెక్టర్ జనరల్గా కమలాసన్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, హోంగార్డు డీఐజీగా అంబర్ కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా శబరీశ్ బదిలీ అయ్యారు._