ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల ఖాతాలో అమ్మఒడి డబ్బులు పడలేదని టిడిపి నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. సీఎం జగన్ పై చెక్ బౌన్స్ కేసు పెడతామని చెప్పారు. కడప జిల్లా వేముల మండలంలో చక్రాయపేట, వేముల మండలం టిడిపి నేతల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటెక్ రవి మాట్లాడారు. పంటల పరిహారం డబ్బులు కూడా చాలా మంది రైతులకు జమకాలేదని ఆరోపించారు. నిధులు విడుదల చేశామని సీఎం చెప్పినా.. ఇంకా డబ్బులు ఎందుకు పడలేదని బీటెక్ రవి ప్రశ్నించారు.
previous post
next post