రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రెజరీ శాఖ కొత్త భవనాన్ని నేడు ప్రారంభించారు. విజయనగరం కలెక్టరేట్ వెనుక భాగాన ఐదు అంతస్థుల కొత్త భవనాన్ని 15 కోట్ల వ్యయం తో నిర్మించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే జోగులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 1978లో విజయనగరం జిల్లాగా ఏర్పడిన కాలంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకుందని అందువల్ల కొత్త భవనం మంజూరు చెయ్యాలని ఆర్థిక మంత్రి ని కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయం సీఎం దృష్టి కి తీసుకెళతానని, విజయనగరం లో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం విషయంలో చొరవ తీసుకుంటానని బుగ్గన చెప్పారు.
previous post
next post