36.2 C
Hyderabad
May 14, 2024 16: 25 PM
Slider విజయనగరం

ఖజానా కార్యాలయం ప్రారంభించిన మంత్రి బుగ్గన

#buggana

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రెజరీ శాఖ కొత్త భవనాన్ని నేడు ప్రారంభించారు. విజయనగరం కలెక్టరేట్ వెనుక భాగాన ఐదు అంతస్థుల కొత్త భవనాన్ని 15 కోట్ల వ్యయం తో నిర్మించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే  జోగులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 1978లో విజయనగరం జిల్లాగా ఏర్పడిన కాలంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకుందని అందువల్ల కొత్త భవనం మంజూరు చెయ్యాలని ఆర్థిక మంత్రి ని కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయం సీఎం దృష్టి కి తీసుకెళతానని, విజయనగరం లో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం విషయంలో చొరవ తీసుకుంటానని బుగ్గన చెప్పారు.

Related posts

పర్యావరణ పరిరక్షణే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా టీచర్ కు సన్మానం

Satyam NEWS

పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment