రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 19 వేల కోట్లను విడుదల చేయనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటన విడుదల చేసింది. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ రూ. 18,241.94 కోట్ల మేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను జారీ చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ ఏడాది రూ. 6,385.20 కోట్లను కేటాయించినప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అదనంగా రూ. 12,548.60 కోట్లను మంజూరు చేసింది.
దీంతో రైతు రుణమాఫీ స్కీమ్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 18,933.80 కోట్లను ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూ. 18,241.94 కోట్ల మేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వగా ఇంకా రూ. 691.85 కోట్ల మేర విడుదల కావాల్సి ఉన్నది.