మహాకవి గురజాడ నడియాడిన నగరంలో పచ్చదనం ఫరిడవిల్లుతోంది.అదీ విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ ముందుండీ చొరవ తీసుకోవడం వలన.
తాజాగా నగరంలో కలెక్టరేట్ సమీపంలోని ప్రారంభం నోచుకోనున్న ఖజానా (ట్రెజరీ బిల్డింగ్ సముదాయంలో) కలెక్టర్ మొక్కలు నాటారు.
ప్రాంగణం మొత్తం పచ్చదనంతో కనిపించాలంటూ అధికారులు నిర్దేశించారు. సోషల్ ఫారెస్ట్ జానకీరామ్, హరిత విజయనగరం బృందం నేత రామ్మోహన్ రావు ,ఈశ్వర్ మాస్టర్ ఆధ్వర్యంలో దాదాపు 50 మొక్కలను కలెక్టర్ నాటారు.
వర్షం పడుతూ ఉన్నా అనుకున్న కార్యక్రమం వాయిదా పడకుండా భవిష్యత్ తరాల కోసం.. ముందు చూపుతో కలెక్టర్ ఈ వర్షాకాలంలో మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు.