రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తులసి రామ్ నగర్ ( లంక ) ఆనుకొని ఉన్న ఓపెన్ ప్లేస్ లో ఈ నెల 24 వ తేది రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పరిసరాల పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.