చైనాలో భారత సరిహద్దుల్లో మరణించిన భారత వీర జవానులకు నిర్మల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఘన నివాళి అర్పించింది. చైనాతో జరిగిన ఈ ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు నిర్మల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకుడు మహేశ్వరరెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు Covid-19, ను దృష్టిలో పెట్టుకోని తెలంగాణ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వీరాజవానులకు కాంగ్రెస్ సలాం ఘన నివాళులర్పించారు. తెలంగాణ ముద్దు బిడ్డ కల్నన్ సంతోష్ బాబు అమరులైనారు వారికి కూడా నివాళులు అర్పిస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అయ్యన్నగారి పోశెట్టి, జడ్పీటీసీ మెంబెర్ తక్కల రమణ రెడ్డి,డీ. ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్,నాందేడపు చిన్నూ,జామాల్, మాజీ కౌన్సిలర్ నెల్ల అరుణ్ కుమార్ రాజేష్, సంతోష్, ఆర్షద్, ప్రజోత్, రఫీ, బాబు, చారణమౌర్య, రవి,అభిలాశ్, తదితరులు పాల్గొన్నారు.