31.7 C
Hyderabad
May 2, 2024 07: 24 AM
Slider ఆదిలాబాద్

భారత సైనికులకు నిర్మల్ లో ఘన నివాళి

#Nirmal Congress

చైనాలో భారత సరిహద్దుల్లో మరణించిన భారత వీర జవానులకు నిర్మల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఘన నివాళి అర్పించింది. చైనాతో జరిగిన ఈ ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు నిర్మల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకుడు మహేశ్వరరెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు Covid-19, ను దృష్టిలో పెట్టుకోని తెలంగాణ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వీరాజవానులకు కాంగ్రెస్ సలాం ఘన  నివాళులర్పించారు. తెలంగాణ ముద్దు బిడ్డ కల్నన్ సంతోష్ బాబు అమరులైనారు వారికి కూడా నివాళులు అర్పిస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అయ్యన్నగారి పోశెట్టి, జడ్పీటీసీ మెంబెర్ తక్కల రమణ రెడ్డి,డీ. ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్,నాందేడపు చిన్నూ,జామాల్, మాజీ కౌన్సిలర్ నెల్ల అరుణ్ కుమార్  రాజేష్, సంతోష్, ఆర్షద్, ప్రజోత్, రఫీ, బాబు, చారణమౌర్య, రవి,అభిలాశ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేప్ కేసు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Satyam NEWS

స్మశానాలకు ఉచితంగా సుమారు వెయ్యి టన్నుల కలప

Satyam NEWS

క‌రోనా పుణ్య‌మా అని ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్!

Satyam NEWS

Leave a Comment