తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ కు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ములుగు జిల్లా కన్వీనర్ జేఏసీ జిల్లా చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ ఘన నివాళి అర్పించారు. అనంతరం మల్లికార్జున్ అంత్యక్రియల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు లో ప్రముఖ పాత్ర పోషించిన గజ్జి మల్లికార్జున కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతని కుటుంబానికి ఏం న్యాయం జరగలేదని అన్నారు.
ములుగు జిల్లా ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మల్లికార్జున్ అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మల్లికార్జున్ కు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించారు. కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ, భూమి కానీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపు అని ఆయన ప్రశ్నించారు.
బిజెపి మండల అధ్యక్షులు మద్ది తేజ రాజు, మాజీ జెడ్పిటిసి కోటి, మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జి ఇరుగు పైడి మాదిగ ముసలయ్య, ఆలయ ప్రచార కమిటీ కార్యదర్శి గుండ మీది వెంకటేశ్వర్లు బల్లి రాజు గౌడ ఐక్యవేదిక ములుగు జిల్లా నాయకులు తిరుపతి గౌడ్ తదితరులు మల్లికార్జున్ కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.