27.7 C
Hyderabad
May 7, 2024 09: 04 AM
Slider విజయనగరం

విజయనగరం లో వైఎస్సార్ జయంతి వేడుకలు…!

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి ఆయన విజయనగరం లో వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నగరంలో వెంకటలక్ష్మి థియేటర్ వద్ద ఉన్న సి.ఎం.ఆర్. జంక్షన్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ పాలన మాదిరిగానే పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ హయాంలోని ప్రభుత్వం కూడా తీవ్ర కృషి చేస్తోందని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డిది మాట తప్పని.. మడం తిప్పని నైజం అని కితాబిచ్చారు. ఆయన పాలన భావితరాల వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఎప్పటికీ మరువ లేని.. మరెవ్వెరు చేయలేని మంచి ప్రజలకు చేశారని గుర్తు చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి రోజున ఇటు నగరంలో.. అటు రాష్ట్రంలో మంచి పనులు చేపట్టామని రైతు దినోత్సవాన్ని.. నగరంలో చేపట్టిన శంకుస్థాపన మాసోత్సవాలను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘురాజు, స నగర మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్లు శ్రావణి, లయ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫోర్జ‌రీ సంత‌కంపై సీసీఎస్‌లో బండి సంజ‌య్‌ ఫిర్యాదు

Sub Editor

ఎన్నికల శిక్షణ పకడ్బందీగా చేపట్టాలి

Bhavani

మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam NEWS

Leave a Comment