36.2 C
Hyderabad
May 12, 2024 15: 57 PM
Slider విజయనగరం

అణగారిన వర్గానికి జగజ్జీవన్ రామ్ ఆశాజ్యోతి

#kolagatla

వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కోలగట్ల ఉద్ఘాటన

అణగారిన  వర్గాన్ని అభ్యున్నతి బాట వైపు నడిపిన పోరాటయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు  విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో ఘనంగా జరిగాయి. ముందుగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ ఆర్సీపీ నగర అధ్యక్షులు ఆసపు వేణు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో   పలువురు కార్పొరేటర్లు, దళిత నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు  బాబు జగజ్జీవన్ రామ్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

జగజ్జివన్ రావు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 13 వ డివిజన్ కార్పొరేటర్ దుప్పాడ సునీత మాట్లాడుతూ అనగారిన వర్గాలను అభ్యున్నతి బాట వైపు నడిపించి,దళితులకు ఆశాజ్యోతి గా నిలిచిన బాబు జగజీవన్ రామ్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అన్నారు. ఆయన చూపిన మార్గం లోనే తామంతా పయనిస్తూ వారి ఆశయసాధనకు కృషి చేస్తున్నామన్నారు. దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ సేవలందించి, దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన పేరుగాంచారని అన్నారు.

6వ డివిజన్ కార్పొరేటర్ రేగాన రూపాదేవి మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యునిగా, 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా అనేక పదవులు అలంకరించి ప్రపంచంలోనే రికార్డు సృష్టించారని కొనియాడారు. జగజీవన్ రామ్ దళితుల ఆశాజ్యోతి అని అభివర్ణించారు. ఈ నెల లో ముగ్గురు మహనీయులు జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్పొరేటర్ ఎస్ వివి రాజేష్, పరిశ్రమ అభివృద్ధి మండలి రాష్ట్ర  డైరెక్టర్  సంఘం రెడ్డి బంగారు నాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పట్నాన పైడ్రాజు, శివ ధనలక్ష్మి, దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాతో మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

Satyam NEWS

అలవాటులో పొరబాటు: …ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే…

Satyam NEWS

సజ్జల కమిటీతో చర్చలకు వెళ్లని ఉద్యోగ సంఘాలు

Satyam NEWS

Leave a Comment