40.2 C
Hyderabad
April 29, 2024 18: 20 PM
Slider నల్గొండ

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి

#jagjeevanram

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలు నందు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ,జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.

ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నిమ్న వర్గాల నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శం కావాలని,వారి నిబద్దత,స్వచ్ఛత దళిత జనోద్దరణకు జగ్జీవన్ రామ్ చేసిన సేవ,కృషి ఎనలేనిదని అన్నారు.

స్వేచ్ఛా సమానత్వం,సామాజిక న్యాయం,సౌభ్రాతృత్వం పుణికి పుచ్చుకున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలను చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ మండల ఇంచార్జి బచ్చలకూరి ప్రసాద్,బయ్యొరపు రామారావు, చింతిర్యాల నాగయ్య,కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు,మీసాల శరత్ కుమార్,యడవెల్లి వీరబాబు,కస్తాల కృష్ణ,గల్లా సైదులు,కస్తాల రవీందర్, కందుకూరి రాము,మందా నాగరాజు, రెడపంగు రాము,పల్లె క్రాంతి కుమార్, మేళ్ళచెరువు నాగేంద్ర బాబు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వైభవంగా రథోత్సవం:పురవీధుల్లో ఊరేగిన దేవదేవులు

Satyam NEWS

మనల్ని మనం రక్షించుకోవడానికి వాక్సినేషన్ ఒక్కటే తరుణోపాయం

Satyam NEWS

శాల్యూట్ టు ఏ పి పోలీస్: కిందిస్థాయి పోలీసులకు డిజిపి కితాబు

Satyam NEWS

Leave a Comment