కరోనా కారణంగా మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ఆత్మకు శాంతి చేకూరాలని TUWJ H 143 ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
హుజూర్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న శాంతి స్థూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు క్రాంతి, ధూళిపాల శ్రీనివాస్, ఉషశ్రీ, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు త్రిపురం రమేష్ రెడ్డి,ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు దొంతగాని రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఇంకా, డబ్ల్యూ డబ్ల్యూ హెచ్ వన్ ఫోర్ త్రీ మండల అధ్యక్షుడు జానీ పాషా, యూనియన్ నాయకులు లక్ష్మణ్, శోభన్, మహేష్ బాబు, రవి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.