తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంగళవారం తెల్లవారుజాము నుండి పుణ్య స్నానాలకు పోటెత్తారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పిఠాపురం పట్టణం, పరిసర గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది. పోలీస్ ఉన్నతాధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా పిఠాపురం లో భారీ పోలీస్ బందోబస్తు, ఫైర్ , మెడికల్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
next post