30.7 C
Hyderabad
April 29, 2024 06: 05 AM
Slider కరీంనగర్

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల సమీపంలో కి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో గల సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

కె ఎ పాల్ పై దాడి చేసిన వారిని టిఆర్ ఎస్ కార్యకర్తలు గా గుర్తించారు. జిల్లా కు కె ఎ పాల్ వస్తున్నారనే సమాచారం తో ముందుగా జిల్లా సరిహద్దుకి టిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.

పోలీసుల ఎదుటే కె ఏ పాల్ పై టిఆర్ ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఈ సందర్భంగా పోలీసుల పై కె ఏ పాల్ ఫైర్ అయ్యారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేక టిఆర్ ఎస్ కార్యకర్తలా మీకు కేటిఆర్ జీతాలు ఇస్తున్నాడా…? ప్రభుత్వం నుండి ప్రజల సొమ్ము నుండి జీతాలు వస్తున్నాయా అంటూ పోలీసుల ను ఆయన ప్రశ్నించారు.

Related posts

కరోనా సమయంలో సేవలు అందించిన R.M.P,P.M.Pలను గుర్తించాలి

Satyam NEWS

మునుగోడు టిక్కెట్ కు బీసీలు అర్హులు కాదా?

Satyam NEWS

శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రం మెలోడి సాంగ్ ‘నిను చూశాక..’ విడుదల

Satyam NEWS

Leave a Comment