రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల సమీపంలో కి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో గల సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కె ఎ పాల్ పై దాడి చేసిన వారిని టిఆర్ ఎస్ కార్యకర్తలు గా గుర్తించారు. జిల్లా కు కె ఎ పాల్ వస్తున్నారనే సమాచారం తో ముందుగా జిల్లా సరిహద్దుకి టిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.
పోలీసుల ఎదుటే కె ఏ పాల్ పై టిఆర్ ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఈ సందర్భంగా పోలీసుల పై కె ఏ పాల్ ఫైర్ అయ్యారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేక టిఆర్ ఎస్ కార్యకర్తలా మీకు కేటిఆర్ జీతాలు ఇస్తున్నాడా…? ప్రభుత్వం నుండి ప్రజల సొమ్ము నుండి జీతాలు వస్తున్నాయా అంటూ పోలీసుల ను ఆయన ప్రశ్నించారు.