రోగనిరోధక శక్తి పెంచే పండ్లు ఫలాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఉప్పల్ శాసనసభ్యుడు బేతి సుభాష్ రెడ్డి అన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్ లోని విజయపూరి కాలనీ లో ముఖ్య మంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ సందర్బంగ పేద ప్రజలకు రోగ నిరోధక శక్తి పెంచే బత్తాయి పండ్లు ను ప్రతి కుటుంబానికి పంపిణీ చేశారు.
అనంతరం కాలనీ డెవలప్ మెంట్ సైన్ బోర్డులను ప్రారంభించారు కార్యక్రమం లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటికయల భాస్కర్, లేతాకుల రఘుపతి రెడ్డి, ఆకుల మహేందర్, జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి, అన్య బాలకృష్ణ, వర్కల భుజెంధర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇంకా, చింతల నరసింహ రెడ్డి, టంటం వీరేష్, రాంరెడ్డి, అన్య వెంకటేష్, వేముల వెంకట్ రెడ్డి, ఆకుల చందు, నిరంజన్, కాడిగె శేఖర్, చీలుకూరి శ్రీకాంత్, గంధం సంపత్, కటికం రాజశేఖర్, మహేశ్ కురుమ, ఆకుల శ్రీనివాస్, రోశయ్య, కాలనీ సభ్యులు లింగా రెడ్డి, రాములు, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, మాధవ్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు కూడా పాల్గొన్నారు.