నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో ని చెన్నారెడ్డి పల్లి, భూనీడు, దుప్పటి గట్టు గ్రామాలకు వీ ఆర్ వో గా విధులు నిర్వహిస్తున్న అనంత పద్మనాభం ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చెన్నారెడ్డి పల్లికి చెందిన రైతు బాజర్ల వెంకటప్ప తన తాత పేరు నుంచి సంక్రమించిన 7 ఎకరాలు తండ్రి పేరు మీదకు విరాసత్ చేసేందుకు వీ ఆర్ వో రూ. 9 వేలు లంచం డిమాండ్ చేశాడు. శుక్రవారం మద్దూరు తహసీల్దార్ ఆఫీస్ ముందే కారులో రూ. 8 వేలు తీసుకుంటుండగా డిఎస్ పి కృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
previous post