పుష్కర కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన రంగినేని అభిలాష్ రావు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ భావితరాల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాని అభిలాష్ రావు తెలియజేశారు.
అభిలాష్ రావు తో పాటు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, కొల్లాపూర్ సీనియర్ నాయకులు, యువ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కి కొల్లాపూర్ నాయకులు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.