అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తారక సంతోష్ కుమార్ ( సంతు) భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. నివాళి అర్పించిన వారిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్, రాష్ట్ర వంజరి సంఘం అధ్యక్షులు కాలేరు నరేష్ ఉన్నారు. సంతు భౌతిక కాయనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోల్నాక డివిజన్ అశోక నగర్ లోని సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్, సంతోష్, శంకర్, రాజు, శ్రీనివాస్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట