జర్నలిస్టుల బతుకులు గాలిలో దీపంలా మారాయి… ఓ వైపు సమాజం బాగుపడాలనే ఉద్దేశ్యంతో జీతాలు లేకున్నా అహర్నిశలు శ్రమిస్తూ.. కరోనా నేపథ్యంలో… వరదల నేపథ్యంలో… జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో… ఇలా సమయ సందర్భం ఏదైనా ఉండనివ్వండి పట్టు వదలకుండా జర్నలిస్టులు (విలేఖరులు) ఆయా నిజాలను ప్రజలకు తెలియజెప్పడమే పాపమైపోయింది. ఏం రా ఏమనుకుంటున్నావురా? అని ఓ జర్నలిస్టును.. నాపైనే రాస్తావా రా? అంటూ పరుష పదజాలంతో… చెప్పుకోలేని భాషలో దూషించిన ఎమ్మెల్యే హెచ్చరికలు బయటపడటం విస్తూగొలిపిస్తోంది. నేర చరితులు… నేర చరితులు అంటే ఏమో అనుకున్నాం గానీ మరీ ఇంత బరితెగించిన నేర చరితనా దేశాన్ని ఏలే ప్రజాప్రతినిధులు అని ఇప్పటికే అనేకమార్లు తేలినా వారి వైఖరిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదని సుస్పష్టంగా తెలుస్తుంది.
ఎమ్మెల్యే బెదిరింపు… ఇక నీ మర్డరే:!?
అడ్డు వస్తే మర్డర్ సినిమా చూపిస్తామంటూ బెదిరింపులు.. సమాజానికి ఉన్నతమైన పాలనను అందించాలని, ఉన్నత స్థితిలో భారతదేశాన్ని, అందులో తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలనుకున్న వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయనేందుకు ఈ తుచ్చ ఎమ్మెల్యే బెదిరింపులే బహిరంగ సాక్ష్యం.. మరీ ఈ చర్యపై సదరు సీఎం, మంత్రి ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి. సమాధానం ఏదీ చెప్పినా రాత్రి వేళలో కాకుండా మిట్టమధ్యాహ్నం చెబితే బాగుంటుంది. ఎందుకంటే సమాజమంతా వింటుంది కాబట్టి.
నిజాలు రాయడమే పాపమా?
ఇక వివరాల్లోకి వెళితే..పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కబ్జాలు, భూ గ్రాబింగ్కు పాల్పడ్డాడనే అనేక ఆరోపణల నేపథ్యంలో సంతోష్ నాయక్ అనే (జర్నలిస్టు) ఓ పత్రికలో ఆరోపణలను ప్రచురించారు. ఇదే ఆయన చేసిన తప్పిదమట! ఏం రా నాపైనే రాస్తావారా? అంటూ నిప్పులు గక్కారు సదరు ఎమ్మెల్యే.. మరీ తమ నేతలంతా శుద్ధ పూసలే అనే సీఎంకు ఈ వార్త చేరిందో? లేదో? గానీ? చేరితే ఏం చర్యలు తీసుకుంటారో? వేచి చూడాల్సిందే..
జర్నలిస్టుతో.. ఎమ్మెల్యే సంబోధన
ఎమ్మేల్యే సదరు జర్నలిస్టుకు ఫోన్ చేసి ఏం రా నాపైనే రాస్తావారా… అన్న ఏం రాశాను (జర్నలిస్టు).. భూ కబ్జాలు అంటూ రాశావు కదరా? ఉండాలనుకుంటున్నావా.. పోవాలనుకుంటున్నావా.. చెప్పరాని భాష.. అన్న జర్నలిస్టుగా అది నా ధర్మం.. రాయాల్సి వస్తుంది.. మీ మీద మాత్రం నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఇదేనా గౌరవం అంటే నా మీదే రాస్తావా.. నీ అంతు చూస్తా..! నిన్ను చంపి పాతరేస్తా…? ఇది ఎమ్మెల్యే బెదిరింపు…
సారు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు?
ఓ మాటంటే గులాబీ నేతలమే అంతా చేశామని, శుద్ధ పూసలమని చెప్పుకుంటున్న సదరు కేసీఆర్ (తెలంగాణ సీఎం) ఇప్పుడేం చెబుతారో? చెవులు తెరుచుకొని విందాం. తుచ్చ నేతలనంతా చంకనెక్కించుకొని సామాన్య ప్రజా జీవితాలతో ఆడుకోవడమే గాకుండా… ఏకంగా ఓ జర్నలిస్టు పైకే వచ్చి సదరు ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డాడంటే ఆయన చరిత్ర తవ్వితే ఇంకేంతుందో?
అంకెల గారడీకి.. తెలియంది ఎంతో ఉంది!
ఆ అయినా ఆయన చరిత్ర తవ్వేదెవరు? … కేసీఆర్ తవ్వుతారా? ఏంటీ? లేకుంటే పటాన్ చెరువు నియోజకవర్గంలో మాత్రం ఈ రింగ్ టోన్ మారిమోగగలదని ఎక్కడ చూసినా ఇదే ప్రతీ ఒక్కరి టీవీల్లో ఫోన్లలో చూస్తున్నారని అంకెల గారడీలను నమ్ముకొని బతికే కొందరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.
జర్నలిస్టు పక్షాన ప్రజా తీర్పు వెలువడేనా?
ఏది ఏమైనా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూ… పిల్లా పాపలను.. భార్యను, తల్లిదండ్రులను కాదనుకొని సమాజహితం కోరే ఓ దేశ సైనికుడిలా పోరాడే జర్నలిస్టు పట్ల ఇలాంటి ధోరణి ఎంతమేర సమంజసమో పటాన్ చెరువు ప్రజలే కాదు.. రానున్న కాలంలో తెలంగాణ రాష్ర్ట ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.