జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఎన్నికల్లో ఓడిపోతామేమో అనే తొందరపాటులో పాత మేనిఫెస్టోనే మళ్ళీ విడుదల చేసి వరాలజల్లు కురిపిస్తున్నట్లుగా మభ్యపెడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక నీటి బుడగను తలపిస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో కిషన్రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
మేనిఫేస్టోను గమనిస్తే సెలూన్లు, దోభీఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ హామీ టీఆర్ఎస్ పార్టీ గతంలోనే ఉందని ఆ విషయాన్ని మరిచి మళ్ళీ మళ్ళీ తిరిగి అదే ముద్రించారని ఆరోపించారు. రేషన్కార్డులు ఇవ్వడానికి ఆరేళ్లు ఎందుకు పట్టిందో? చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి రూ.67వేల కోట్లు ఖర్చు ఎక్కడ చేశారో ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు రెచ్చగొట్టే ప్రయత్నాలు, మతవిద్వేషాలు లాంటి వాటిని బీజేపీ ఎప్పటికీ చేయదని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. అందరికీ సమానత్వమే తమ ఏజెండా అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్వాకం వల్లే ఎంఎంటీఎస్ రెండో దశ ఆగిపోయిందనే విషయం రాష్ర్ట ప్రజలందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు.