28.7 C
Hyderabad
May 6, 2024 01: 43 AM
Slider వరంగల్

ఉత్సాహంగా ములుగు జిల్లాలో తెరాస గ్రామ కమిటీ ఎన్నికలు

#mulugutrs

ములుగు జిల్లా లోని గ్రామాల్లో తెరాస పార్టీని పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ములుగు మండలం లో ఉత్సహంగా గ్రామకమిటీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుదీర్ జడ్పీటీసీ సకినాల భవాని ఆధ్వర్యంలో నేడు మందనపల్లి, జగ్గన్నపేట, పొట్లపూర్, దేవగిరి పట్నం గ్రామశాఖ అధ్యక్షులను గ్రామస్తులు, తెరాస కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మధనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పొలబోయిన రఘుపతి, జగ్గన్నపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా భూక్యా రమేష్, పొట్లపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్, దేవగిరిపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడిగా జోసప్ రెడ్డి ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులకు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుదీర్, జడ్పీటీసీ సకినాల భవాని నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుదీర్ మాట్లాడుతూ గ్రామకమిటీ ఎన్నికల్లో యువత స్వచ్చందంగా బంగారు తెలంగాణ లో భాగస్వాములు ఆవ్వడానికి  ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్  రాష్ట్రం లో తిరుగులేని రాజకీయ  శక్తిగా ఉన్నదని అన్నారు.

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వార్థం లేకుండా స్వరాష్ట్రం కోసం 14 ఏళ్ళు అలుపెరుగని పోరాటం చేసి సాధించిన ఘనుడు కెసిఆర్ అని అన్నారు. సంక్షేమ పధకాలు పెట్టి ప్రతి గడప గడపకు  అందిస్తున్న నాయకుడు ముఖ్య మంత్రి కెసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమం లో ములుగు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కేశెట్టి కుటుంబారావు, మండలపార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్, జడ్పీకోప్షన్ మెంబెర్ రియాజ్ మీర్జా,ఎంపీటీసీ నూవత్ మహేష్,పాలేపు ఆదిరెడ్డి సర్పంచ్ గద్దల పద్మ శ్రీనివాస్ జిల్లా నాయకులు గట్టు మహేందర్,పిండి రవియాదవ్, ద్రోణచారి, చెన్న విజయ్,తరుణ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

సూర్యాపేటలో జూన్ 2 సంబురాలకు సర్వం సిద్ధం

Bhavani

ప్రకాశం జిల్లా సమస్యలపై ప్రధాని సానుకూల స్పందన

Satyam NEWS

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

Bhavani

Leave a Comment