వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం విద్య, వైద్యం, వ్యవసాయం మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆర్ధికంగా సహాయం అందించాలని పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. తన వినతిపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. నేడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రధానిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. సానుకూలంగా స్పందించి ప్రకాశం జిల్లా అభివృద్ధికి సహాయపడతానని తెలియజేసిన ప్రధాన మంత్రికి ప్రకాశం జిల్లా ప్రజల తరఫున మాగుంట కృతఙ్ఞతలు తెలిపారు.
previous post