గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో ఎటువంటి ధన, ప్రాణ నష్టం కలగకుండా సహాయక చర్యల్లో తెరాస పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు బాధ్యతగా సేవలందించాలని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మంగళ వారం రోజున జెడ్పీ కార్యాలయం లో ఆయన వివిధ మండలాల ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
సమస్య తీవ్రత ఎక్కువగా వున్నచోట తన దృష్టికి తీసుకురావాలని , మండలాలకు నియమించబడ్డ స్పెషల్ అధికారుల తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవిందరావు పేట సూడి.శ్రీనివాస్ రెడ్డి, ఏటూరు నాగారం వ్యవసాయ డివిజన్ ఆత్మా చైర్మెన్ దుర్గం.రమణ,ములుగు మండలం పంచాయతీ రాజ్ ae అజిత్,ములుగు మండలం తెరాస అధ్యక్షుడు,యువజన విభాగం నాయకులు బాదం.ప్రవీణ్,బైకని సాగర్,గోవిందు నాయక్,తుమ్మ మళ్ళా రెడ్డి,వలీ బాబా, ముడతనపెల్లి మోహన్,ఆది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.