‘లోన్ తీసుకున్నా. కడుతూనే ఉన్నా. అయినా టార్చర్ చేస్తున్నారు. కట్టకపోతే నా సెల్ఫీని మార్ఫ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి చుట్టాలందరికీ పెడతామన్నారు. నాకు వేరే దారి లేదు. సారీ అమ్మా’ అంటూ మంగళగిరికి చెందిన వివాహిత ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
లోన్ యాప్ నుంచి ఆమె రూ.20,000 లోన్ తీసుకుని ఇప్పటికి రూ. 12,000 కట్టింది. మిగతా మొత్తం చెల్లించాలని టార్చర్ చేయడంతో ఉరేసుకుని, ఆత్మహత్య వేసుకుంది. అయితే ఇలాంటి వాటిపై వెంటనే ప్రభుత్వం పోలీసులు చర్యలు చేపట్టిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పిరికి ఆలోచనలు చేయకుండా పోలీసులను సంప్రదించండి.