ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు వారు కువైట్ లో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. వారిని మానవతా దృక్పథంతో ఆదుకొనేందుకు నందమూరి వంశ అభిమానులునడుం బిగించారు.
కడప జిల్లా కు చెందిన ఎన్నారై కువైట్ ఎన్టీఆర్ టూ యన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కరోనాతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి చుండు బాలరెడ్డయ్య నాయుడు, గుదే నాగార్జునచౌదరి ,షేక్ సుభాన్, ఎస్.డి.ఎన్టీఆర్ తదితరులు రెండవ విడతగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఓమేరియా, పర్వానియా, అబ్బాసియా, హావల్లి ప్రాంతాల్లో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నందమూరి కుటుంబ అభిమానులు కష్ట కాలంలో ఇలా నిత్యావసర వస్తువుల వితరణ చేయడంపై అక్కడి తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.