30.7 C
Hyderabad
April 29, 2024 04: 27 AM
Slider ఆదిలాబాద్

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

#Fatal

మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ దగ్గర గురువారం రోజున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

మందమర్రి ఏరియా శంకర్పల్లికి చెందిన దర్శనాల రమేష్, అతని భార్య, వెన్నెల వారి కుమారుడు సూర్య తేజ గోదావరిఖని వెళ్లి వస్తుండగా జిఓ ఆఫీస్ వైపు తిరుగుతున్న సమయంలో అటుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది.

ట్రాక్టర్ వాహనం శ్రీరాంపూర్ వర్క్ షాప్ నుండి అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దానిపై ప్రయాణిస్తున్న దర్శనాల రమేష్ వారి కుమారుడు సూర్య తేజ స్పాట్ లోనే చనిపోయారు. భార్య వెన్నెల పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

పెరిగిన నిత్యవసర దరలను వెంటనే తగ్గించాలని డిమాండ్

Satyam NEWS

(NEW) Diabetes Medicines Rybelsus Ways To Control Type 2 Diabetes Control Blood Sugar With Cinnamon

Bhavani

సామాజిక బాధ్యత గుర్తుచేసేందుకు 555 కిలోమీటర్ల నడక

Satyam NEWS

Leave a Comment