29.7 C
Hyderabad
May 3, 2024 05: 21 AM
Slider చిత్తూరు

తిరుమల దేవస్థానం సిబ్బందిలో 98 మందికి పాజిటీవ్

#Anilkumar Singhal IAS

తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి విస్తృతంగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 98 మంది కి పాజిటీవ్ వచ్చిందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఉద్యోగులకు ఎక్కువ టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులపై ఊళ్లకు వెళ్ళి రావడం వల్ల కరోనా సోకిందని ఆయన అన్నారు. చాలా మంది సిబ్బందికి సింప్టమ్స్ లేకపోయినా టెస్టుల్లో మాత్రం పాజిటివ్ వస్తోందని ఆయన అన్నారు. 

ఒకవేళ తిరుమలకు వచ్చే భక్తుల ద్వారా కరోనా వ్యాపిస్తోందా అనే విషయంపై కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ భక్తుడికి కూడా కరోనా సోకలేదని ఆయన అన్నారు.

Related posts

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు

Satyam NEWS

క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

పంట నష్టం జరగొద్దు

Murali Krishna

Leave a Comment