సమాజంలోని జర్నలిస్టులు ప్రజల గొంతుకై నినదించాలని హుజూర్ నగర్ 16వ,వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కారింగుల విజయ వెంకటేశ్వర్లు గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 16వ,వార్డులో టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన కోల నాగేశ్వరరావు ను కౌన్సిలర్ విజయ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. జర్నలిస్టులు ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడి సమస్యల పరిష్కారంలో ముందుండాలని అన్నారు.స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందేలా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,కంబాల శ్రీనివాసు పి.
కోటేశ్వరరావు,దళపతి సంపత్ వర్మ,బోళ్ల గోవిందరెడ్డి,అనిల్ కుమార్,ఆకుల రాము, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్