అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్ళపై పశ్చిమగోదావరి ఎస్ పి వేటు వేశారు. ఏలూరు మూడవ టౌన్ పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. రామ్ ప్రసాద్, సతీష్ కుమార్ అనే ఈ ఇద్దరు కానుస్టేబుళ్ళ పై వచ్చిన అవినీతి అరోపణలను ఎస్ పి విచారణ చేయించారు. ఆరోపణలు రుజువైన నేపధ్యంలో జిల్లా ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
previous post