నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరూ అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణ (58) దంపతులు గా గుర్తించారు.
అగ్ని మాపక దళ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే వీరు ఎందుకు మరణించింది తెలియలేదు. పోలీసులు కేసు ను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.