విజయవాడ శివారులోని కంకిపాడులో గ్యాస్ సిలెండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్త ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. శివరామకృష్ణ ,యమిని అనే ఈ ఇద్దరు తమ ఇంట్లో అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క సారిగా గ్యాస్ సిలెండర్ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురైన పరుగులు తీశారు.
పెద్ద శబ్దంతో బాటు మంటలు కూడా చెలరేగడంతో ఈ దంపతులకు మంటలు అంటుకున్నాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.